అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector Ila Tripathi | విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో (SSC results) సిరికొండ (Sirikonda) మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వారు ప్రజావాణిలో (Prajavani) కలెక్టర్ను కలివగా.. అభినందించారు.
Collector Ila Tripathi | ఏం అవ్వాలనుకుంటున్నారు..?
పదో తరగతి ఫలితాల్లో 550కు పైగా మార్కులు సాధించి పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారంటూ కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో అధ్యాపకుల సలహాలు సూచనలు పాటిస్తూ బాగా చదువుకుని ఉత్తమ స్థానాల్లో నిలవాలని సూచించారు. 107 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంపై కలెక్టర్ డీఈవో అశోక్ను అభినందించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ (PRTUTS) జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, జడ్పీహెచ్ఎస్ సిరికొండ గెజిటెడ్ హెచ్ఎం సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Mamata Banerjee Statement| అంతిమ విజయం తృణమూల్ దే.. బెంగాల్ గడ్డపై దీదీ ధీమా!


[…] అనంతరం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని(Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క […]