అక్షరటుడే, వెబ్డెస్క్: Gujarat ship attack | హోర్ముజ్ జలసంధిలో గుజరాత్కు చెందిన ఒక వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు జరిపిన దాడిలో, గుజరాత్కు చెందిన నావికుడు అల్తాఫ్ తలాబ్ కెర్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం నుంచి 17 మంది నావికులు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఇప్పటికీ గల్ఫ్ ప్రాంతంలోని వివిధ నౌకల్లో 1,100 మందికి పైగా భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
Gujarat ship attack | భారత్ ఎందుకు లక్ష్యం?
ఈ యుద్ధ ఉద్రిక్తతల మధ్య అదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఇతర దేశాల నౌకల పరిస్థితిని పరిశీలిస్తే.. చైనా నౌకలు సురక్షితం. పాకిస్థాన్ నౌకలకు ఎలాంటి ఆటంకం లేదు. బంగ్లాదేశ్ నౌకలు సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.
కానీ, భారతీయ నౌకలు, భారతీయ నావికులే లక్ష్యంగా దాడులు జరుగుతుండటం గమనార్హం. గతంలో హౌతీ రెబల్స్ సైతం భారతీయ నౌకలనే ముందుగా లక్ష్యం చేసుకున్నాయి.

