Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampet Police | నాటుతుపాకీతో కాల్చుకుని ఓ యువకుడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన లింగంపేట (Lingampet) మండలంలో గురువారం కలకలం సృష్టించింది.

Lingampet Police | మోతె గ్రామంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోతె (Mothe) గ్రామానికి చెందిన తిలిపితీయా ఇంద్రజిత్ సింగ్ (28) గురువారం ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు పంపివేసి గదిలోకి వెళ్లాడు. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఛాతిపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త మరణవార్త విని తట్టుకోలేకపోయిన ఇంద్రజిత్ సింగ్ భార్య తీవ్ర మనస్తాపంతో గ్రామ సమీపంలోని కుడికుంటలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Paddy Procurement | చివరి గింజ వరకు కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *