అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | నగరంలోని సీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి (Nizamabad police) 16 ఫిర్యాదులు అందాయి. అదనపు డీసీపీ(అడ్మిన్) శుభం ప్రకాశ్ ఫిర్యాదులు స్వీకరించారు.
Police Prajavani | చట్టప్రకారం పరిష్కరించాలి
ప్రజావాణిలో( prajavani) ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం అదనపు డీసీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ సిబ్బందికి సూచించామన్నారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని అదనపు డీసీపీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Telangana Voter List Revision | జూన్ 25 నుంచి SIR సర్వే.. కీలక తేదీల షెడ్యూల్ ఇదే