అక్షరటుడే, వెబ్డెస్క్: Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగిన కీలక సమావేశం ముగిసింది. టాలీవుడ్లో గత కొంతకాలంగా నెలకొన్న పలు అంశాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఎగ్జిబిటర్ల సెక్టార్కు సంబంధించిన ‘పర్సంటేజీ విధానం’పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
థియేటర్ల నిర్వహణ, కలెక్షన్ల షేరింగ్కు సంబంధించిన పర్సంటేజీల వ్యవహారంలో తలెత్తిన సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ఛాంబర్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Telugu Film Chamber | ప్రత్యేక సబ్-కమిటీ ఏర్పాటు
ఈ వివాదాల శాశ్వత పరిష్కారం చూపేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేసింది.
ఛైర్మన్: నిర్మాత డి.సురేష్బాబు
కన్వీనర్లు: దిల్ రాజు Dil Raju, అల్లు అరవింద్, కే.ఎల్ నారాయణ, కె. అశోక్ కుమార్
పరిశ్రమలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, ఈ సబ్ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సమ ప్రాధాన్యం కల్పించారు.
ఈ కమిటీ సభ్యులు సమావేశమై, పర్సంటేజీల వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించాల్సి ఉంది. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో టాలీవుడ్లో సజావుగా వ్యాపారాలు సాగేలా ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Jayam Ravi Divorce | ‘నా భార్య విడాకులు ఇచ్చేవరకు సినిమాలు చేయను’ – జయం రవి సంచలన ప్రకటన!


