అక్షరటుడే, వెబ్డెస్క్: EAPCET results | తెలంగాణ EAPCET ఫలితాల్లో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్ పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ అధ్యాపకుల మార్గదర్శకత్వంలో లక్ష్యసాధనకు కృషి చేయడం వల్లే విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతో పాటు EAPCETకు ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం EAPCETలో కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
EAPCET results | ర్యాంకులు సాధించింది వీరే..
అబ్దుల్ షాహిద్ 3406 ర్యాంక్ సాధించగా.. ఆత్రిజ్ 3862, ఎ.వచన్ 4,974, భావకీర్తన్ 5,963, లోక సామిక్ష 6,085, ఈ.శరత్ చంద్ర 7,003, సిద్ధి వినాయక్ 7,350, మైరతైతెల్ 7,390, సదియా ఫిర్దౌస్ 7,830, సుజానా 8,450, తుబా ఫాతిమా 9,666, ఐషా ఆలం 10,990 ర్యాంకులు సాధించారు.
EAPCET results | నాణ్యమైన విద్యా విధానంతోనే..
కాకతీయ కాలేజీలో నాణ్యమైన విద్యా విధానంతోనే ఉత్తమ ర్యాంకులు సాధ్యమయ్యాయని ఛైర్పర్సన్ తెలిపారు. పారదర్శకత, నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన విద్య అందించడంతో విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొన్ని విద్యాసంస్థలు వివిధ బ్రాంచ్లలో వచ్చిన స్టేట్ ర్యాంకులను తమ బ్రాంచ్కు చెందినవిగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. తల్లిదండ్రులు సరైన సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాకతీయ విద్యాసంస్థల పరిధిలోని రెసిడెన్షియల్ కాలేజ్ విద్యార్థులు సాధించిన ఒకే బ్రాంచ్ నుంచే వచ్చినవని స్పష్టం చేస్తున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Drone Attack | యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి


