అక్షరటుడే, వెబ్డెస్క్ : Dead body in Train | రైలులో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో చోటు చేసుకుంది. మహిళ మృతదేహాన్ని ముక్కులుగా చేసి బ్యాగ్, పెట్టెలో పెట్టి రైలులో వదిలి వెళ్లారు.
లక్నో రైల్వే SP రోహిత్ మిశ్రా (SP Rohit Mishra) తెలిపిన వివరాల ప్రకారం.. ఛప్రా నుంచి గోరఖ్పూర్ మీదుగా గోమతి నగర్ వెళ్లే ఒక రైలులో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్లీపర్ కోచ్లో వారికి ఒక పెట్టె, బ్యాగ్ కనిపించాయి. వెంటనే వారు స్టేషన్ మాస్టర్ (Station Master)కు సమాచారం అందించారు. ఆయన ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులకు తెలియజేశారు.
Dead body in Train | తెరిచి చూడగా షాక్
అధికారులు ఆ పెట్టె, బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిచి చూడగా.. మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా ఉంది. తల లేకుండా మొండెం మాత్రమే ఉండటం గమనార్హం. శరీర అవయవాలను వేర్వేరు పాలిథీన్ సంచులలో ప్యాక్ చేసి ఆ బ్యాగ్లో ఉంచారు. సుమారు 25 నుండి 30 ఏళ్ల వయసున్న మహిళదిగా భావిస్తున్న ఈ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. తల దొరకకపోవడంతో మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాటిని ఎవరు పెట్టారో గుర్తించడానికి రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీని, ప్రయాణికుల రిజర్వేషన్ వివరాలను పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Tamil Nadu Road Accident | మధురైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి


