జాతీయంTamil Nadu Road Accident | మధురైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన...

Tamil Nadu Road Accident | మధురైలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu Road Accident | తమిళనాడులోని మధురై (Madhurai) సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం హృదయ విదారకంగా మారింది.

ఆలయ దర్శనం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మధురైలోని అన్నా నగర్ ప్రాంతానికి చెందిన ప్రకాశ్ తన బంధువు రమేశ్‌తో పాటు కుటుంబ సభ్యులైన మరో ముగ్గురు మహిళలతో కలిసి తిరుచిరాపల్లిలోని ప్రముఖ సమయపురం మరియమ్మన్ ఆలయానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం దర్శనం పూర్తిచేసుకుని తిరిగి మధురై వైపు కారులో బయలుదేరారు.

Tamil Nadu Road Accident | పూర్తిగా ధ్వంస‌మైన కారు..

అయితే మధురై జిల్లా మేలూరు సమీపంలోని అయ్యపట్టి వద్ద హైవేపై ప్రయాణిస్తుండగా వారి కారు అకస్మాత్తుగా అదుపుతప్పింది. అనంతరం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన రక్షణ బ్యారియర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత అంతగా ఉండటంతో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది. కారులో ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న కొట్టంపట్టి పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు అధికారులు కొంతసేపు శ్రమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం మేలూరు ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)కి తరలించారు.

Tamil Nadu Road Accident | ఈ విషాద ఘటనతో..

ప్రాథమిక విచారణలో ప్రమాదానికి అతివేగం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే డ్రైవర్ నిద్రమత్తు, వాహనంలో సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువుల రోదనలు హృదయాలను కలచివేస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Bihar Train Fire | రైలులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...

Youth Drowning | ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి యువకుడి మృత్యువాత

అక్షరటుడే, బాన్సువాడ: Youth Drowning | ఎండ వేడిని తట్టుకోలేక స్నేహితులతో...