అక్షరటుడే, వెబ్డెస్క్ : Swimming Pool Death | స్విమ్మింగ్ పూల్లో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) శివారులోని మొయినాబాద్ మండలంలో చోటు చేసుకుంది.
మొయినాబాద్ మండలం (Moinabad Mandal) కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్హౌస్లో జరిగిన బర్త్ డే పార్టీకి హైదరాబాద్ మజీద్బండకు చెందిన సాయి హాజరు అయ్యాడు. అతడు యాక్సిస్ బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి పుట్టిన రోజు వేడుకల్లో సాయి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. అయితే ఎవరు అతడిని గమనించలేదు. సోమవారం ఉదయం ఫామ్హౌజ్ వాచ్మన్ గమనించి స్నేహితులకు సమాచారం ఇచ్చారు.
Swimming Pool Death | తల్లిదండ్రుల అనుమానం
స్విమ్మింగ్ పూల్ నుంచి సాయిని తీసి వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాని వైద్యులు తెలిపారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు.మృతుడి తల్లిదండ్రులు farmhouseకు చేరుకోకముందే, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడి మృతిపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Youth Sports Festival | నేటి నుంచి క్రీడా – యువజన వారోత్సవాలు


