అక్షరటుడే, వెబ్డెస్క్: Warangal Congress Unity | ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా వర్గపోరుతో విమర్శలు చేసుకుంటున్న నాయకులు ఒక్కటయ్యారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. క్షేత్రస్థాయి నాయకుల నుండి సీనియర్ నాయకత్వం వరకు అందరు హాజరు అయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేయడం, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవడం ఎలా అని చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి సురేఖ (Minister Surekha)తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Warangal Congress Unity | ఆసక్తికరం..
వరంగల్ (Warangal) రాజకీయాల్లో కొంతకాలంగా వర్గపోరు నెలకొంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మెల్యేలకు పడటం లేదు. మంత్రి భర్త కొండా మురళి పలుమార్లు ఇతర నాయకులుపై విమర్శలు చేశారు. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానం, క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. ముఖ్యంగా కొండా మురళి కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై విమర్శలు చేశారు. అంతేగాకుండా ఆయన కుమార్తె పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఉన్నారు. దీంతో కొండా కుటుంబానికి, ఇతర ఎమ్మెల్యేలకు దూరం పెరిగింది. ఈ క్రమంలో అందరు నేతలు ఒకచోట సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.
Warangal Congress Unity | మున్సిపల్ ఎన్నికల కోసం..
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కీలకమైన వరంగల్ కార్పొరేషన్ను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే వర్గపోరు నేపథ్యంలో పార్టీ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో అందరు నేతలు కలిసి పని చేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో వరంగల్ నాయకుల సమావేశం జరిగింది.
ఇది కూడా చదవండి..: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ


