RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగినా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఆర్​ఐ ఏసీబీకి చిక్కాడు.

వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండి మండల రెవెన్యు ఇన్​స్పెక్టర్ రాంబాబు మ్యూటేషన్​ కోసం లంచం డిమాండ్​ చేశాడు. క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదికను సమర్పించి, ఫిర్యాదిదారుడి పూర్వీకుల ఆస్తికి మ్యుటేషన్ చేయించడానికి రూ. 10 వేలు అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్​ఐ రాంబాబును ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. నిందితుడైన అధికారిని అరెస్టు చేసి, వరంగల్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

RI Caught by ACB | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Narsampet Tension | నర్సంపేట డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *