అక్షరటుడే, వెబ్డెస్క్ : RI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగినా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు.
వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండి మండల రెవెన్యు ఇన్స్పెక్టర్ రాంబాబు మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్ చేశాడు. క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్కు నివేదికను సమర్పించి, ఫిర్యాదిదారుడి పూర్వీకుల ఆస్తికి మ్యుటేషన్ చేయించడానికి రూ. 10 వేలు అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్ఐ రాంబాబును ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. నిందితుడైన అధికారిని అరెస్టు చేసి, వరంగల్లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
RI Caught by ACB | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి..: Narsampet Tension | నర్సంపేట డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్


