Nizamabad Police Commissionerate | అర్ధరాత్రి వరకు హోటల్​ ఓపెన్​.. ఒకరికి రెండు రోజుల జైలు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Commissionerate | నగరంలో అర్ధరాత్రి వరకు హోటల్​ను తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఒకటో టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి వివరాలు వెల్లడించారు.

Nizamabad Police Commissionerate | నగరంలోని మాలపల్లిలో..

నగరంలోని మాలపల్లిలోని ఓ హోటల్​ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినట్లు పోలీసులు (nizamabad Police) గుర్తించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి స్పెషల్​ సెకండ్ క్లాస్ కోర్టు (Special Second Class Court) జడ్జి ఎదుట గురువారం హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో రఘుపతి మాట్లాడుతూ ఎవరైనా నిర్ణీత సమయం దాటి పాన్​ దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తెరిచి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Kalaignar Women Scheme| మహిళలకు సీఎం విజయ్ తీపి కబురు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *