అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Police Commissionerate | నగరంలో అర్ధరాత్రి వరకు హోటల్ను తెరిచి ఉంచిన వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి వివరాలు వెల్లడించారు.
Nizamabad Police Commissionerate | నగరంలోని మాలపల్లిలో..
నగరంలోని మాలపల్లిలోని ఓ హోటల్ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినట్లు పోలీసులు (nizamabad Police) గుర్తించారు. ఈ సందర్భంగా హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి స్పెషల్ సెకండ్ క్లాస్ కోర్టు (Special Second Class Court) జడ్జి ఎదుట గురువారం హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్హెచ్వో రఘుపతి మాట్లాడుతూ ఎవరైనా నిర్ణీత సమయం దాటి పాన్ దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు తెరిచి ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Kalaignar Women Scheme| మహిళలకు సీఎం విజయ్ తీపి కబురు..


