అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Municipal Water Supply | నగరంలో తాగునీటి సరఫరాపై కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ (Dilip Kumar) ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ మేరకు ఆయన కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు.
Municipal Water Supply | 12, 41వ డివిజన్లలో..
నగరంలోని 12, 41వ డివిజన్లో కమిషనర్ గురువారం పర్యటించారు. డివిజన్లోని ఆయా కాలనీల్లో తిరుగుతూ తాగునీటి సరఫరా, శానిటేషన్ జరుగుతున్న తీరుపై అధికారులతో మాట్లాడారు. అలాగే ఆయా కాలనీల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని పేర్కొన్నారు. మున్సిపల్(Nizamabad Municipal Corporation) నీటిసరఫరాలో ఎక్కడా అంతరాయం ఏర్పడకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డీడీఈలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Mla Bhupathi reddy | విద్యపై ఖర్చు పెట్టడమంటే భవిష్యత్ తరాలకు పెట్టుబడి లాంటిది: ఎమ్మెల్యే భూపతిరెడ్డి


