అక్షరటుడే, నర్సంపేట: RTC Compensation | పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంది. శంకర్ గౌడ్ పార్థివ దేహానికి స్థానిక ఆర్డీవో ఉమారాణి (RDO Umarani) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి భారీ సహాయాన్ని ఆమె ప్రకటించారు.
RTC Compensation | ప్రభుత్వం, నేతల అండ
రూ.10 లక్షల పరిహారం: శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక పరిహారం మంజూరు చేసింది. కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే మానవత్వం : నర్సంపేట ఎమ్మెల్యే (Narsampet MLA) దొంతి మాధవరెడ్డి మానవత్వం చాటుకున్నారు. తన వంతుగా వ్యక్తిగతంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: RTC Workers Protest | పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు

