అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran US Tensions | హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరాన్ వాణిజ్య నౌక తౌస్కాపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ఆ తర్వాత నౌకను స్వాధీనం చేసుకుంది.
అమెరికా దళాలు ఒక ఇరాన్ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపి, దానిని స్వాధీనం చేసుకన్నాయని ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ ఘటన తర్వాత ఇరాన్ దళాలు ఒమన్ సముద్రంలో అమెరికా సైనిక నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేశాయి. ఈ ప్రాంతంలో రెండు వారాల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందం మధ్య, టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగినట్లు ఈ దాడులు సూచిస్తున్నాయి.అమెరికా ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకుని, దానిపై కాల్పులు జరిపింది.

Iran US Tensions | వీడియో విడుదల
ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు వైపు ప్రయాణిస్తున్న ఒక ఇరాన్ సరుకు రవాణా నౌకపై కాల్పులు జరిపి, తమ అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సైన్యం తెలిపింది. టౌస్కాగా గుర్తించబడిన ఆ నౌక, హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో యూఎస్ మెరైన్లు ఆ నౌకలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. యూఎస్ నేవీ నౌకను స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలను చూపిస్తూ ఫుటేజ్ను విడుదల చేసింది.
Iran US Tensions | ప్రతీకారం తీర్చుకుంటాం
తమ నౌకను అదుపులోకి తీసుకోవడం ఇరాన్ స్పందించింది. ఈ ఘటనను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. దీనికి ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించింది. యూఎస్ దళాలు (US Forces) నౌకలోకి ప్రవేశించే ముందు దానిపై కాల్పులు జరిపి, దాని నావిగేషన్ వ్యవస్థను నిలిపివేశాయని ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో కాల్పుల విరమణ ఒప్పందం నిర్ణీత గడువు ముగిసే వరకు కూడా కొనసాగుతుందా లేదా అనే దానిపై సందేహాలను రేకెత్తించాయి. కాగా నేడు పాకిస్థాన్లో అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి.
#WATCH | US Central Command tweets, “US forces operating in the Arabian Sea enforced naval blockade measures against an Iranian-flagged cargo vessel attempting to sail toward an Iranian port, April 19. Guided-missile destroyer USS Spruance (DDG 111) intercepted M/V Touska as it… pic.twitter.com/LXRwVaEsxc
— ANI (@ANI) April 20, 2026
ఇది కూడా చదవండి..: US Shooting Incident | అమెరికాలో దుండగుడి కాల్పులు.. ఎనిమిది మంది చిన్నారుల దుర్మరణం!

