అక్షరటుడే, వెబ్డెస్క్: Ram Charan Peddi | గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఈ సినిమాపై తమకున్న వీరాభిమానాన్ని చాటుకునేందుకు ఇద్దరు జపనీస్ మహిళలు ఏకంగా టోక్యో నుంచి హైదరాబాద్కు తరలిరావడం ఇప్పుడు చిత్రసీమలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.

Ram Charan Peddi | 3 రోజులు.. 10 సార్లు!
సినిమాపై ఉన్న పిచ్చితో టోక్యోకు చెందిన ఈ ఇద్దరు మహిళలు ప్రత్యేకంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి థియేటర్లలో ‘పెద్ది’ సినిమాను కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 10 సార్లు చూడాలని వారు ఒక పక్కా ప్లాన్తో వచ్చారు. ఒక విదేశీ నటుడి సినిమాను, అది కూడా భాష తెలియని ప్రాంతానికి వచ్చి ఇన్ని సార్లు చూడాలనుకోవడం వారి అభిమానానికి నిలువెత్తు నిదర్శనం.
Ram Charan Peddi | భాష అడ్డంకి కాదు.. ₹2 లక్షల ఖర్చు!
మన భాష రాకపోయినా, రాంచరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనను ఆస్వాదించడానికి వారు ప్రత్యేకంగా సిద్ధమవడం విశేషం. సినిమా కథను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ముందే కొంత హోంవర్క్ సైతం చేసుకున్నారట. కేవలం థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం, తమ అభిమాన హీరో సినిమాను లోకల్ ఆడియన్స్తో కలిసి ఎంజాయ్ చేయడం కోసం వారు దాదాపు ₹2 లక్షలు ఖర్చు పెట్టుకుని భారత్కు రావడం గమనార్హం.

Ram Charan Peddi | విపరీతమైన ఫ్యాన్ బేస్
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో జపాన్లో రాంచరణ్కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం ఈ స్థాయి క్రేజ్ చూడటం టాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపిస్తోంది.” అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భాషతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్, హీరోల క్రేజ్ చూసి ఖండాలు దాటి వస్తున్న ఇటువంటి అభిమానులను చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ జపనీస్ లేడీస్ పిక్స్, వారి ప్లానింగ్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
