అక్షరటుడే, వెబ్డెస్క్: Iran Pakistan Talks | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో Abbas Araghchi నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం Islamabadలో పర్యటిస్తోంది. నిలిచిపోయిన చర్చలకు మళ్లీ ఊపిరి పోసేందుకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.
Iran Pakistan Talks | అబ్బాస్ నేతృత్వంలో..
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి పాకిస్తాన్ నాయకత్వంతో కీలక భేటీలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా Shehbaz Sharif, సైన్యాధిపతి Asim Munirలతో సమావేశాలు జరగనున్నాయి. ఇరు పక్షాలను మళ్లీ చర్చల బల్లపైకి తీసుకురావడంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కీలకమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. అయితే, పాక్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, అమెరికా సైతం దౌత్యపరమైన చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారులు ఇస్లామాబాద్కు రానున్నట్లు సమాచారం.

Iran Pakistan Talks | ట్రంప్ స్పందన
అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇప్పటికే పరిస్థితిపై స్పందిస్తూ.. ఇరాన్ ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా స్పష్టంగా లేవని తెలుస్తోంది.
ఇదే సమయంలో Strait of Hormuz ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం కలిగితే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా, ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఈ దౌత్యపరమైన కదలికలు శాంతి చర్చలకు కొత్త దారితీస్తాయా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది.
RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు

