అక్షరటుడే, వెబ్డెస్క్: RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఆర్టీసీ సమ్మె పై కాసేపట్లో కూడా జేఏసీ నేతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేపు (ఏప్రిల్ 25) 1st షిఫ్ట్ బస్సులు రోడ్డెక్కనున్నట్లు సమాచారం.
RTC JAC Talks | బకాయిల చెల్లింపుపై ఎదురుచూపులు
తెలంగాణ సచివాలయంలో శుక్రవారం రాత్రి మంత్రులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల పెండింగ్ పీఆర్సీ బకాయిలపై పీఠముడి పెట్టారు. బకాయిలు వెంటనే చెల్లించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి కావాలని మంత్రులు కోరారు. కాగా, పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టత కోసం ఎదురుచూపులు జేఏసీ నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్టీసీ జేఏసీ నేతల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Somalia Oil Tanker Hijack | రెచ్చిపోయిన సముద్రపు దొంగలు.. ఆయిల్ ట్యాంకర్ హైజాక్.. సిబ్బంది బందీ

