అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Labor Codes | కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల లేబర్ కోడ్లను అమలు పర్చేందుకు గెజిట్ తీసుకొచ్చిందని.. దానిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కార్మికులతో కలిసి గెజిట్ పత్రాలను దహనం చేశారు.
Labor Codes | వెనక్కి తగ్గని పీఎం మోదీ..
ఈ సందర్భంగా రమేశ్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల యజమానులకు మరింత లాభాలను పెంచడానికి కార్మిక హక్కులను పణంగా పెడుతోందన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చారని.. వీటిపై దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించినప్పటికీ పీఎం మోదీ వెనక్కి తగ్గట్లేదన్నారు. మోదీ ప్రభుత్వం (Modi Government) నిరసనలను లెక్కచేయకుండా గెజిట్ను విడుదల చేసిందన్నారు. ఫలితంగా ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు లేబర్ కోడ్లను అమలు చేసేందుకు పని గంటలు పెంచటానికి వేతనాల్లో కోతలు విధించడానికి సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు.
Labor Codes | కార్మికులకు భద్రత కరువు..
కోడ్ల కారణంగా కార్మికులకు భద్రత లేకుండా పోయిందని రమేశ్ బాబు వివరించారు. ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నట్లేనన్నారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్ (Labour Code)లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోందన్నారు. లేకపోతే రాబోయే కాలంలో అన్ని రంగాల కార్మికులతో ఐక్య పోరాటాలకు సిద్దపడాల్సి వస్తుందని దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గంగామోహన్, నాయకులు సంపత్, శేషు, లక్ష్మీకాంత్, కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం.. బీజేపీకి సంబంధం లేదు: ఎమ్మెల్యే పైడి రాకేష్ సంచలన వ్యాఖ్యలు


