అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhu Bharati server down | రాష్ట్రంలో మంగళవారం భూ భారతి (Bhu Bharati) సేవలు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఆగిపోయాయి. దీంతో కార్యాలయాకు వచ్చిన ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాశారు.
భూ భారతి పోర్టల్ సర్వర్ డౌన్తో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో సబ్-రిజిస్ట్రార్ (Sub-Registrar) కార్యాలయాల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్ల కోసం ఉదయమే కార్యాలయాలకు చేరుకున్న ప్రజలు సర్వర్ రాకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అయితే సాయంత్రం వరకు కూడా సర్వర్ రాకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోయారు. మ్యూటేషన్లు, స్లాట్ బుకింగ్స్, ఈసీ డౌన్లోడ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. సేవలు పునరుద్ధరించేందుకు సాంకేతిక నిపుణులు యత్నిస్తున్నారు.
Bhu Bharati server down | తరచూ సమస్య
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. అయితే ఈ పోర్టల్ తరచూ మొరాయిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్టేషన్ల శాఖ సర్వర్ సక్రమంగా పని చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్ సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక కారణాలు, సర్వర్లపై ఒత్తిడి పెరగడంతో అంతరాయం ఏర్పడి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Transfers | రాష్ట్రంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ

