అక్షరటుడే వెబ్డెస్క్: CBSE On-Screen Marking | సీబీఎస్ఈ బోర్డు అమలు చేస్తున్న ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు , దానివల్ల విద్యార్థుల మార్కులు తగ్గుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డిజిటల్ మూల్యాంకన విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, బోర్డును ఆదేశించింది.
CBSE On-Screen Marking | విధానంలో లోపాలు..
డిజిటల్ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, మార్కులు ఆశించిన స్థాయిలో రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంకేతిక లోపాల వల్ల తమ భవిష్యత్తు, ఉన్నత విద్యలో ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని విద్యార్థుల తరపున పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం, విద్యార్థుల మానసిక ఆందోళనను బోర్డు తీవ్రంగా పరిగణించాలని సూచించింది.
CBSE On-Screen Marking | ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు..
ఈ అంశంపై ప్రభుత్వం స్పందిస్తూ, డిజిటల్ మూల్యాంకనంలోని లోపాలను సరిదిద్దేందుకు ఇప్పటికే ఎస్.రాధా చౌహాన్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ఈ కమిటీ విద్యార్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైన సంస్కరణలు చేపడుతుందని వెల్లడించారు.
CBSE On-Screen Marking | కోర్టు ఆదేశాలు..
పిటిషనర్ అభ్యర్థన మేరకు, సాంకేతిక లోపాల వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, మూల్యాంకన ప్రక్రియలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికను (స్టేటస్ రిపోర్ట్) సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Nizamabad Education Review | విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి