అక్షరటుడే, వెబ్డెస్క్ : Census 2027 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన 133వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అణు, పునరుత్పాదక ఇంధన రంగాలలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ప్రముఖంగా ప్రస్తావించారు. తమిళనాడులోని కల్పక్కం వద్ద ఉన్న 500 MWe ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) ఏప్రిల్ 6న ‘మొదటి క్రిటికాలిటీ’ని (first criticality) సాధించడాన్ని దేశ పౌర అణు కార్యక్రమానికి ఒక “చారిత్రక మైలురాయి”గా అభివర్ణించారు.
జనాభా గణన దేశానికి ఒక ముఖ్యమైన ప్రచారమని పేర్కొంటూ, అందులో చురుకుగా పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వారి సమాచారం సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన ప్రక్రియ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఇది పౌరులందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన అన్నారు.
Census 2027 | స్వదేశీ టెక్నాలజీతో..
తమిళనాడులోని కల్పక్కంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. అంటే రియాక్టర్ కార్యాచరణ దశ ప్రారంభం అయినట్లు అని చెప్పారు. ఇది దేశ అణుశక్తి ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. ఈ అణు రియాక్టర్ను పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారని వెల్లడించారు. పవన విద్యుత్లో సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

Census 2027 | అమూల్యమైన పత్రాలు
భారత జాతీయ ఆర్కైవ్స్ ఒక ప్రత్యేక పోర్టల్లో ఒక విశిష్టమైన డేటాబేస్ను పంచుకుందని మోదీ తెలిపారు. ఈ సంస్థ 20 కోట్లకు పైగా అమూల్యమైన పత్రాలను డిజిటలైజ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందననారు. వీటిలో కొన్ని చాలా ఆసక్తికరమైనవి, బిర్చ్ బెరడుపై రాసిన 7వ శతాబ్దపు గిల్గిత్ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయన్నారు.
Began today’s #MannKiBaat with an accomplishment of India’s civil nuclear programme, which reaffirms the excellence of our scientists! I am proud of our civil nuclear programme’s contribution to nation-building. pic.twitter.com/CwnGoOkcRZ
— Narendra Modi (@narendramodi) April 26, 2026
దీనిని కూడా చదవండి : Rahul Gandhi remarks | దేశాన్ని అమ్ముతున్న ప్రధాని.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

