అక్షరటుడే, వెబ్డెస్క్ : Census self enumeration | జనగణన 2027లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్వీయ నమోదు (Self-Enumeration) కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.
Census self enumeration | అందరూ పాల్గొనాలి
జనగణన అధికారులు ముఖ్యమంత్రికి స్వీయ నమోదు విధానాలు, ప్రాముఖ్యత గురించి వివరించారు. కచ్చితమైన, సమర్థవంతమైన వివరాల సేకరణలో ఈ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభావవంతమైన ప్రణాళిక, అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అందరూ జనగణన ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగణన కార్యకలాపాల సంచాలకులు భారతి హోలికేరి (Bharathi Holikeri), GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సంయుక్త ప్రధాన జనగణన అధికారి ప్రియాంక ఆలా (ZC ఖైరతాబాద్), I&PR కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు.

కాగా రాష్ట్రంలో జన గణన ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల వివరాలు సేకరిస్తారు. అయితే ఆన్లైన్ ద్వారా ప్రజలు సైతం నేరుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ సారి ఈ ప్రక్రియను ప్రవేశ పెట్టారు. సెల్ఫ్ ఎన్యుమరేటర్తో ప్రజలు తమ వివరాలను పక్కాగా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
దీనిని కూడా చదవండి : SI Suspended | అన్న అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్సై.. సస్పెండ్ చేసిన అధికారులు

