అక్షరటుడే, ఇందూరు: Padmashali Corporators | నగరంలోని (Nizamabad City) వర్నిరోడ్ పద్మశాలి హాస్టల్లో (Padmashali Hostel) పద్మశాలి వసతి గృహ సంస్థ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి కార్పొరేటర్లు ఇప్పకాయల సుమిత్ర, సామల ప్రసన్నను ఘనంగా సన్మానించారు.
Padmashali Corporators | అభివృద్ధికి కృషి చేయాలి..
అనంతరం వక్తలు మాట్లాడుతూ.. నగరంలోని ఆయా డివిజన్ల అభివృద్ధికి పద్మశాలి కార్పొరేటర్లు కృషి చేయాలని సూచించారు. అలాగే పద్మశాలి కమ్యూనిటీ అభివృద్దికి సైతం పాటు పడాలని సూచించారు. కార్యక్రమంలో పద్మశాలి హాస్టల్ అధ్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి, గంట్యాల వెంకటేష్, కోశాధికారి కన్న రాజు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి, దాసరి నర్సింలు, పుల్గం హన్మాండ్లు, మైసల నారాయణ, సామల సత్యపాల్, బాస రాజేశ్వర్, పార్థసారథి, హరిదాస్, తన్నీరు శ్రీనివాస్, లక్కవత్రి దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Census India 2027 | జనగణన ప్రక్రియ దేశానికి ఎంతో కీలకం..: షబ్బీర్ అలీ

