అక్షరటుడే, వెబ్డెస్క్ : Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ను కోరారు. ఏడు కారిడార్లతో కూడిన సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్ను ఇప్పటికే సమర్పించామని తెలిపారు.
ఢిల్లీ (Delhi) పర్యటనలో ఉన్న సీఎం బుధవారం కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -II, మెట్రో ఫేజ్ -III పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు, మూడో దశ పనులు సజావుగా సాగాలనే ఎల్అండ్టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Metro Phase 2 | రూ.38 వేల కోట్లతో..
రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ -IIలో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిందని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ను భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
Metro Phase 2 | ఫేజ్–3 కోసం..
నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ను మెట్రో ఫేజ్ -IIIగా చేపట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్ను కూడా ఇప్పటికే సమర్పించామన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్.వి.ఎస్.రెడ్డి పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ..

