RTC bus accident | పండ్లు కొనేందుకు వెళ్లిన వ్యక్తిని కబలించిన ఆర్టీసీ బస్సు

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTC bus accident | పండ్లు కొనేందుకు రోడ్డుపైకి వచ్చిన వ్యక్తి ఆర్టీసీ బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి (Yellareddy) మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.

RTC bus accident | ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఏమిలి అరుణ్ (45) పండ్లు కొనుగోలు చేయడానికి ఎల్లారెడ్డి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి పట్టణానికి వస్తున్న బస్సు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు (Yellareddy Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *