School Admissions | ఫలించిన ఉపాధ్యాయుల కృషి.. ప్రభుత్వ పాఠశాలలో భారీగా అడ్మిషన్లు

పెద్దగొడప్​గల్​ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 113 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.

shashi kiran Mottala

అక్షటుడే, పెద్దకొడప్​గల్: School Admissions | మండల కేంద్రంలోని (Pedda Kodapgal) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 113 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. హెచ్​ఎం కమల నేతృత్వంలో ఉపాధ్యాయులు పడిన కష్టానికి ప్రతిఫలం లభించింది.

School Admissions | ప్రైవేట్​కు ధీటుగా..

పాఠశాలలో (Government School) 113వ అడ్మిషన్​ను మంగళవారం ఎంఈవో ప్రవీణ్ కుమార్ చేతలు మీదుగా హెచ్​ఎం తీసుకున్నారు. ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇంగ్లిష్ మీడియం బోధన, ‘మన ఊరు–మన బడి–పీఎం శ్రీ’ (PM SHRI) లాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సందర్భంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు విద్యార్థుల వలసలు పెరిగి, అనేక పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా (Student Enrolment) పెరుగుతున్నాయన్నారు. స్మార్ట్ తరగతులు, డిజిటల్ విద్య, ప్రయోగశాలలు, మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని.. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందచేస్తున్నామన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కమల, నాగనాథ్, కిషోర్, రాజు, సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Siddapur Reservoir | సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *