అక్షరటుడే, వెబ్డెస్క్ : CI & SI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. లంచాలకు మరిగిన అధికారులు అన్ని శాఖాల్లో తిష్ట వేశారు. తమ వద్దకు వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు చేపడుతున్నా.. కనీసం భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకున్న ఏ సీఐ, ఎస్సైపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
వికారాబాద్ (Vikararbad) జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక క్రిమినల్ కేసులో BNSS నోటీసులు జారీ చేయడానికి రూ.60,000 డిమాండ్ చేసిన సీఐ బి సరోజ (CI Saroja), ఎస్సై హెచ్ రాణిపై కేసు నమోదు చేశారు. సదరు అధికారులు గతంలో పోలీస్ స్టేషన్లో రూ.20 వేలు లంచం తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
CI & SI Caught by ACB | రూ.60 వేలు డిమాండ్
వికారాబాద్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ (Women’s Police Station)లో ఓ వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులపై అతడి భార్య వేధింపుల కేసు పెట్టింది. మొత్తం ఆరుగురిపై కేసు పెట్టగా.. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్సై డిమాండ్ చేశారు. లంచం ఇస్తే అరెస్ట్ చేయకుండా నోటీసులతో సరి పెడతామన్నారు. అయితే బాధితులు బతిమిలాడటంతో ఆ మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించారు. ఇందులో రూ.20 వేలు గతంలోనే తీసుకున్నారు. మిగతా డబ్బు కోసం పోలీసులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు మంగళవారం విచారణ చేశారు. లంచం తీసుకున్నట్లు తేలడంతో సీఐ సరోజ, ఎస్సై రాణిపై కేసు నమోదు చేశారు.

CI & SI Caught by ACB | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : TGPSC PCB Jobs | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

