అక్షరటుడే, వెబ్డెస్క్: Deputy Collectors Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) 14 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా కొనసాగుతున్న బి.జయశ్రీని సిరిసిల్ల డీఆర్వోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి డీఆర్వో కె.అనంతరెడ్డిని, నిర్మల్ ఆర్డీవోగా దేవదాస్ను నియమించింది. సిరిసిల్ల ఆర్డీవోగా డి శ్రీధర్బాబు, కరీంనగర్ ఆర్డీవోగా ఎం.షర్మిల, ములుగు ఆర్డీవోగా కృష్ణవేణి, మహబూబాబాద్ ఆర్డీవోగా ఎం.రాజేశ్వరి, ఇబ్రహీంపట్నం ఆర్డీవోగా వై.శ్రీనివాస్రెడ్డి నియమితులయయారు.
Deputy Collectors Transfers | వారికి పోస్టింగ్

రాజేంద్రనగర్ ఆర్డీవోగా డి.శ్రీధర్, హైదరాబాద్ డీఆర్వోగా కె నారాయణను బదిలీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లును జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పెద్దపల్లి అదనపు కలెక్టర్గా కొప్పుల వెంకట్రెడ్డి, ఖమ్మం ఐపీటీ రైల్వే ఎస్డీసీగా జి.సదానందం, యదాద్రి భువనగిరి భూసేకరణ ఎస్డీసీగా కేసీ ప్రమీలకు పోస్టింగ్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి..: Government Doctors Strike | సర్కార్ దవాఖానల్లో ఓపీ సేవలు బంద్.. సమ్మె బాటలో వైద్యులు
