అక్షరటుడే, వెబ్డెస్క్: E20 Janata Party | దేశంలో మరో వ్యంగ్య రాజకీయ పార్టీ ఏర్పాటు అయింది. కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నిరసనలతో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జెన్జీ యువత ఇన్స్టాగ్రామ్ వేదికగా.. ఈ 20 జనతా పార్టీని ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో ఇథనాల్ కలుపుతున్న విషయం తెలిసిందే. గతంలో 10 శాతం ఇథనాల్ కలుపగా.. ఇటీవల దానిని 20 శాతానికి పెంచింది. దేశవ్యాప్తంగా ఈ 20 పెట్రోల్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాహనాలు పాడవుతాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి వ్యతిరేకంగా ‘ఈ20 జనతా పార్టీ’ని కొందరు ఏర్పాటు చేశారు.
E20 Janata Party | 2 లక్షల ఫాలోవర్లు
ఈ20 పార్టీకి ఇన్స్టాగ్రామ్లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంఇ. తక్కువ ధరకు 100 శాతం అసలైన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛను, ఈ20 ఇంధనంపై డిజిటల్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. E20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గుతుందని, వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
E20 Janata Party | వెనక్కి వెళ్లేది లేదు
ఈ 20 పెట్రోల్ సురక్షితమైనదని, ఇంజిన్లకు ఎలాంటి నష్టం కలగదని కేంద్రం చెబుతుంది. E10 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల్లో E20 ఇంధనాన్ని వాడినప్పుడు మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని ప్రభుత్వం అంగీకరించింది. తిరిగి వందశాతం ప్యూర్ పెట్రోల్ వైపు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేసింది. పూర్తిగా ఈథనాల్తో నడిచే (ఈ 85) ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ విజయవంతం కావడంతో E20 పార్టీ ఆవిర్భావానికి ప్రాముఖ్యత పెరిగింది.ఢిల్లీ టాక్సీ, పర్యాటక, టూర్ ఆపరేటర్ల సంఘం ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించి, ఆగస్టు 4న పార్లమెంటుకు పాదయాత్రను ప్రకటించింది. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా, అలాగే వాణిజ్య వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు, పానిక్ బటన్లను తప్పనిసరిగా అమర్చడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే ఈ నిరసనలో టాక్సీ ఆపరేటర్లు, పర్యాటక వాహనాల యజమానులు మరియు ఇతర వాణిజ్య వాహన ఆపరేటర్లు పాల్గొంటారని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Supreme Court SC Status | మతం మార్చుకుంటే ఎస్సీ హోదా కోల్పోతారు.. సుప్రీంకోర్టు