అక్షరటుడే, వెబ్డెస్క్: Eknath Shinde | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) శనివారం థానేలోని జూపిటర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన నిన్నటి నుంచి స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. ముందుజాగ్రత్త చర్యగా వైద్యుల సలహా మేరకు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల బృందం నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Eknath Shinde | షిండే ఆరోగ్యంపై ప్రభావం
ప్రాథమిక సమాచారం ప్రకారం.. కొన్ని రోజులుగా అధిక పనిభారం, నిరంతర రాజకీయ కార్యక్రమాల కారణంగా షిండే ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం. ఆరోగ్య సమస్యల కారణంగా.. అన్ని కార్యక్రమాలను రద్దు చేసి, చికిత్స కోసం థానేలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శివసేన వర్గాలు పేర్కొన్నాయి.
Eknath Shinde | ఢిల్లీకి పలుమార్లు పర్యటన

మహారాష్ట్రలో జరిగిన అనేక కీలక రాజకీయ పరిణామాల్లో షిండే చురుకుగా పనిచేశారు. “ఆపరేషన్ టైగర్”లో భాగంగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు ఎంపీలు, ముంబై శాసనమండలి సభ్యుడు సచిన్ అహిర్ను తమ వర్గంలో చేర్చుకోవడంతో షిండే కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా, ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఈ ఒత్తిడితో కూడిన షెడ్యూల్ ఆయన ఆరోగ్య సమస్యలకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Karnataka Footpath Policy | ఫుట్పాత్లను ఆక్రమించి నాయకుల ఫ్లెక్సీల ఏర్పాటు.. సీఎం ఆగ్రహం.. రూ. లక్ష వరకు జరిమానా విధించాలని ఆదేశం!