అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Free Medical Camp | నగరంలోని (Nizamabad) 20వ డివిజన్లో కాలనీవాసుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరం (Health Checkup) ఏర్పాటు చేశారు. ఎల్లమ్మగుట్టలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ న్యాలం సునీత రాజు ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు.
Free Medical Camp | 400 మందికి పైగా..
ఈ సందర్భంగా డివిజన్లోని సుమారు 400మందికి పైగా ప్రజలు ఈ ఉచిత శిబిరంలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వారికి కంటి వైద్యం, బీపీ, రక్తపరీక్షలు, టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. డివిజన్ ప్రజల కోసం కార్పొరేట్ న్యాలం సునీత రాజు ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, గంగాధర్, మిట్టు గంగాధర్, సాగర్, వైద్యురాలు కీర్తి, వైద్యుడు చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్వో సికిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat Gen Z | వాళ్లు దేశ వ్యతిరేకులు కారు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు