అక్షరటుడే, వెబ్డెస్క్ : Government Pre Primary Timings | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడుల్లో వసతులను కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను గతేడాది ప్రారంభించింది. మరికొన్ని బడుల్లో ఈ ఏడాది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం చేపడుతోంది.
ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల సమయ వేళలను తాజాగా ప్రభుత్వం మార్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి జిల్లాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగనున్నాయి. హైదరాబాద్/సికింద్రాబాద్లో ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు క్లాసులు ఉంటాయి. వేసవిలో ఉదయం 7:45 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ (Education Department) ఆదేశాలు జారీ చేసింది.
Government Pre Primary Timings | పెరగనున్న విద్యార్థుల సంఖ్య

గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేట్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించింది. అంతేగాకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనుంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Development Projects | రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
