అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. నిత్యం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసుల్లో సైతం దూకుడు పెంచారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికాడు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై వి నర్సింహులును ఏసీబీ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకుఉన్నారు. ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆయన రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. అందులో నుంచి రూ.50 వేలు తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఎస్సైని అరెస్ట్ చేశారు. అతడిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ (ACB Website) ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : Brahmajivadi Bus | బ్రహ్మాజీవాడికి బస్సోచ్చింది.. ఊరంతా సంబరపడింది..