అక్షరటుడే, వెబ్డెస్క్: H1N1 Cases Delhi | దేశ రాజధాని ఢిల్లీలో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) మంగళవారం అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.
H1N1 Cases Delhi | మూడు వేల ఇన్ఫ్లూయెంజా కేసులు
ఆరోగ్య శాఖ, ఎంసీడీ, ఎన్డీఎంసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఈ ఏడాది సుమారు 3,000 ఇన్ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయని తెలిపారు. వాటిలో 2,308 హెచ్1ఎన్1 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేదు. కేసుల నేపథ్యంలో సీఎం అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. ఎలాంటి సమస్య లేదని, అంతా అదుపులోనే ఉందని చెప్పారు.
H1N1 Cases Delhi | పాఠశాలలకు అడ్వైజరీ
స్వైన్ ఫ్లూ (H1N1)తో సహా సీజనల్ ఇన్ఫ్లూయెంజా నుంచి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యాశాఖ ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు అడ్వైజరీ జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆరోగ్య అవగాహనను పెంచుకోవాలని, మరియు ఇన్ఫెక్షన్ నివారణ, శ్వాసకోశ పరిశుభ్రత చర్యలను పటిష్టం చేసుకోవాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: Caste Census Data | ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ..