Excise Employees Welfare | ఎక్సైజ్​ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తాం..

జిల్లా ఎక్సైజ్​ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ పేర్కొంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Excise Employees Welfare | జిల్లా ఎక్సైజ్​ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ పేర్కొంది. మంగళవారం జిల్లా ఎక్సైజ్​ అధికారి నందగోపాల్​ను కమిటీ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Excise Employees Welfare | బాసర జోన్​ పరిధిలో..

జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (DPEO) కార్యాలయంలో మంగళవారం బాసర జోన్ (CD2) పరిధిలో ఇటీవల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెచ్​సీ, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికైంది. కమిటీకి ఛైర్మన్​గా కైలాస్ పవార్, వైస్ ఛైర్మన్​గా లింబాద్రి, కోశాధికారిగా చల్లా బాబు కలిసి జిల్లా ఎక్సైజ్​ అధికారిని కలువగా ఆయన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ కోశాధికారి భాస్కర్ రావు, డీటీఎఫ్​ జిల్లా ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్​ సీహెచ్​ విలాస్ కుమార్, డీపీఈవో కార్యాలయ ఏఏవో నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, శేఖర్ రాజ్​, జూనియర్​ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: TNGO Dharna Nizamabad | 27న టీఎన్జీవోస్​ నిజామాబాద్​ ఆధ్వర్యంలో ధర్నా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *