అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మూసివేశారు. రెండురోజుల క్రితం క్రేజీ వీల్ విరిగిన (crazy wheel accident) ఘటనలో పలువురికి గాయాలైన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్ను(Numaish) మూసివేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Nizamabad Exhibition | వరుస సంఘటనలతో..
ఈ సీజన్లో నుమాయిష్లో వరుస సంఘటనలు సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశాయి. కొన్నిరోజుల క్రితం మహిళ ఎగ్జిబిషన్లోనే గుండెపోటుతో మృతి చెందగా.. తాజాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు క్రేజీ వీల్ విరిగిపోవడంతో గాయపడ్డారు. ప్రస్తుతం పరికరాలను మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం మూసివేస్తున్నట్లుగా నిర్వాహకులు నోటీస్బోర్డుపై పేర్కొన్నారు. ఈ మేరకు 3వ టౌన్ ఎస్సై హరిబాబును(Nizamabd Police) సంప్రదించగా ఎగ్జిబిషన్లో విరిగిన క్రేజీ వీల్ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఒకరోజు నిర్వాహకులు నుమాయిష్ను మూసివేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. నీటి సరఫరాలో అంతరాయం


