Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు మరమ్మతులు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​ను  మూసివేశారు. రెండురోజుల క్రితం క్రేజీ వీల్​ విరిగిన (crazy wheel accident) ఘటనలో పలువురికి గాయాలైన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్ (Numaish) ​ను మూసివేయడం గమనార్హం.

Nizamabad Exhibition | వరుస సంఘటనలతో..

ఈ సీజన్​లో నుమాయిష్​లో వరుస సంఘటనలు సందర్శకులను భయభ్రాంతులకు గురిచేశాయి. కొన్నిరోజుల క్రితం ఎగ్జిబిషన్​లోనే ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందగా.. తాజాగా సోమవారం ఇద్దరు వ్యక్తులు క్రేజీ వీల్​ విరిగిపోవడంతో గాయపడ్డారు.

ప్రస్తుతం పరికరాలను మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా మంగళవారం మూసివేస్తున్నట్లుగా నిర్వాహకులు నోటీసు ​బోర్డుపై రాసుకొచ్చారు. ఈ మేరకు 3వ టౌన్​ ఎస్సై హరిబాబు (Nizamabd Police) ను సంప్రదించగా.. ఎగ్జిబిషన్​లో విరిగిన క్రేజీ వీల్​ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు ఒకరోజు నిర్వాహకులు నుమాయిష్​ను మూసివేసినట్లు తెలిపినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి:Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *