అక్షరటుడే, నిజామాబాద్ అర్భన్: Wheel Accident in Exhibition | నగరంలోని పాలిటెక్నిక్ మైదానం (Polytechnic Ground)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆహ్లాదంను అందించాల్సిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఇబ్బందులను గురిచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం రాత్రి క్రేజీవీల్ ట్రాలీ ఊడిపడి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
Wheel Accident in Exhibition | పెరిగిన సందర్శకుల తాకిడి..
నగరంలో ఏర్పాటు చేసిన నుమాయిష్కు జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. వేసవి సెలవుల దృష్ట్యా సందర్శకుల తాకిడి ఎక్కవగానే ఉంటుంది. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజుల క్రితం ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. తాజాగా ఆదివారం నుమాయిష్లో ఏర్పాటు చేసిన క్రేజీ వీల్ ట్రాలీ రన్నింగ్లోనే విరిగి కింద పడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో ఓ వ్యక్తి కిందపడ్డ తర్వాత ట్రాలీలోనే కొద్దిసేపటి వరకు ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.

Wheel Accident in Exhibition | కనీస వైద్య సదుపాయాలు కరువు..
ఎగ్జిబిషన్కు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే ఆ ప్రాంతంలో కనీస వైద్యసదుపాయాలు సైతం ఏర్పాటు చేయలేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే వెంటనే ప్రథమ చికిత్స (First Aid) చేసేందుకు సైతం ఎలాంటి ఏర్పాటు చేయలేదని వారంటున్నారు.
ఇది కూడా చదవండి..: Heart Attack | కువైట్లో గుండెపోటుతో వేల్పూర్ వాసి మృతి


