Wheel Accident in Exhibition | ఎగ్జిబిషన్​లో ప్రమాదం.. విరిగిన క్రేజీ వీల్​ ట్రాలీ..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్భన్​: Wheel Accident in Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానం (Polytechnic Ground)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​లో ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆహ్లాదంను అందించాల్సిన ఎగ్జిబిషన్​ సందర్శకులను ఇబ్బందులను గురిచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆదివారం రాత్రి క్రేజీవీల్​ ట్రాలీ ఊడిపడి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

Wheel Accident in Exhibition | పెరిగిన సందర్శకుల తాకిడి..

నగరంలో ఏర్పాటు చేసిన నుమాయిష్​కు జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. వేసవి సెలవుల దృష్ట్యా సందర్శకుల తాకిడి ఎక్కవగానే ఉంటుంది. అయితే నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పదిరోజుల క్రితం ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందింది. తాజాగా ఆదివారం నుమాయిష్​లో ఏర్పాటు చేసిన క్రేజీ వీల్​ ట్రాలీ రన్నింగ్​లోనే విరిగి కింద పడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో ఓ వ్యక్తి కిందపడ్డ తర్వాత ట్రాలీలోనే కొద్దిసేపటి వరకు ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు.

Wheel Accident in Exhibition

Wheel Accident in Exhibition | కనీస వైద్య సదుపాయాలు కరువు..

ఎగ్జిబిషన్​కు వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే ఆ ప్రాంతంలో కనీస వైద్యసదుపాయాలు సైతం ఏర్పాటు చేయలేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. జరగరానిది ఏదైనా జరిగితే వెంటనే ప్రథమ చికిత్స (First Aid) చేసేందుకు సైతం ఎలాంటి ఏర్పాటు చేయలేదని వారంటున్నారు.

ఇది కూడా చదవండి..: Heart Attack | కువైట్​లో గుండెపోటుతో వేల్పూర్​ వాసి మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *