Nagavali Express | నాగావళి ఎక్స్​ప్రెస్​లో గంజాయి పట్టివేత..

నిజామాబాద్​ నగరంలో భారీగా గంజాయిని ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nagavali Express | నగరంలో(Nizamabad) భారీగా గంజాయిని ఎక్సైజ్​ పోలీసులు (Ganja Seizure) పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్హెచ్​వో వివరాలు వెల్లడించారు.

Nagavali Express | దర్జాగా రైళ్లలో గంజాయి సరఫరా..

ఎస్​హెచ్​వో తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రైల్వేస్టేషన్​కు వస్తున్న నాగావళి ఎక్స్​ప్రెస్​లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో స్టేషన్​లో రైలు ఆగిన అనంతరం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బీహార్​కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్​లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 5.1కిలోల గంజాయి,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు. తనిఖీల్లో ప్రోహిబిషన్ అండ్​ ఎక్సైజ్ సబ్ ఇన్​స్పెక్టర్​ ఏ.గంగాధర్, మల్లేష్, ట్రెయినీ ఏఈఎస్ గాయత్రి, కానిస్టేబుళ్లు దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు.

nizamabad 2

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్​ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *