అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Co-option Election | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation)లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కో–ఆప్షన్ ఎన్నిక (co-option election) ఎట్టకేలకు పూర్తయింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఛైర్పర్సన్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన జరుగగా..పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Nizamabad Co-option Election | నాలుగు నెలల క్రితం మన్సిపల్ ఎన్నికలు..
నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు పూర్తిచేశారు. నాలుగు నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిజామాబాద్ మేయర్ పీటాన్ని చేజిక్కించుకుంది. అనంతరం సోమవారం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. కార్పొరేటర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

Nizamabad Co-option Election | కో ఆప్షన్ సభ్యులు వీరే..
స్పెషల్ కేటగిరి జనరల్ కోటాలో ముజీబ్ హైమద్, మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మాధురి, కల్లెడ అశోక్ ఎన్నికయ్యారు. మైనారిటీ కోటా కింద ఉజ్మా జరనామ్, సర్దార్ నరేందర్ సింగ్లు ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి..: Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

