అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay Son POCSO Case | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది.
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)తో చర్చించారు. విచారణ తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Bandi Sanjay Son POCSO Case | లైంగికంగా వేధించాడని..
తమ కూతుర్ని లైంగికంగావేధించాడని భగీరథ్పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పేట్బషీరాబాద్ పోలీసులు (Petbasheerabad Police) కేసు నమోదు చేశారు. సీఎం ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్పల్లి డీసీపీ రుతిరాజ్ సిట్కు నేతృత్వం వహించనున్నారు.
ఇది కూడా చదవండి..: Bandi Sanjay Son | బండి సంజయ్ కుమారుడిపై కేసు.. సీఎం కీలక ఆదేశాలు

