అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Sanjay Son | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సాయిపై పోక్సో కేసు (POCSO Case) నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.
మైనర్ బాలికను వేధించాడని పేట్బషీర్బాద్ ఠాణాలో భగీరథ్పై కేసు నమోదు అయింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భగీరథ్పై నమోదైన కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)ను సీఎం ఆదేశించారు. 8వ తేదీనే ఫిర్యాదు నమోదైనప్పటికీ, చర్యలు తీసుకోవడంలో జరిగిన జాప్యంపై ముఖ్యమంత్రి DGPని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను DGP ఆనంద్ ముఖ్యమంత్రికి వివరించారు.
Bandi Sanjay Son | ప్రధాని పర్యటన నేపథ్యంలో..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన దృష్ట్యా, మొత్తం పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని డీజీపీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీంతో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అయిందన్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) ఛైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించుకుని విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి..: Modi Telangana Visit | తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

