అక్షరటుడే, వెబ్డెస్క్: Iran Counter | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల భారత్ను నరకంతో పోలుస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలకు తాజాగా ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.
జన్మత అమెరికా పౌరసత్వ చట్టం విషయంలో భారత్, చైనాలను నరక కూపాలుగా ట్రంప్ అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ దేశాల నుంచి వచ్చే ప్రజలు పిల్లలను కన్న తర్వాత కుటుంబాన్ని మొత్తం అక్కడకు తీసుకు వెళ్తారని ఉన్న లేఖను ఆయన పోస్ట్ చేశారు. ఇరాన్ ఆయనను ఎగతాళి చేసింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్, మహారాష్ట్ర గొప్ప సాంస్కృతిక, భౌగోళిక వారసత్వాన్ని వివరిస్తూ ఒక వీడియోను ఎక్స్లో షేర్ చేసింది. ట్రంప్ను ఎవరైనా భారత పర్యటనకు తీసుకు వస్తే బాగుంటుందని పేర్కొంది.
Iran Counter | తీవ్ర విమర్శలు
అమెరికన్ రాజకీయ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ పోడ్కాస్ట్ను ట్రంప్ రీపోస్ట్ చేసిన తర్వాత ఈ వివాదం చెలరేగింది. ఆ పోడ్కాస్ట్లో సావేజ్, భారత్, చైనా ఇతర దేశాలను “నరక కూపాలు”గా అభివర్ణించారు. అమెరికా జన్మహక్కు పౌరసత్వ చట్టంలో మార్పులు కోరుతూ చేసిన తన జాత్యహంకార వ్యాఖ్యలలో, ఆ రెండు ఆసియా దేశాల ప్రజలు “తొమ్మిదవ నెలలో బిడ్డను కనడానికి” అమెరికాకు వస్తారని, ఆ చట్టం వారిని “తక్షణమే” అమెరికా పౌరులుగా మారుస్తుందని సావేజ్ ఆరోపించారు. అంతేగాకుండా భారతీయ, చైనీస్ వలసదారులను “ల్యాప్టాప్లు ఉన్న గ్యాంగ్స్టర్లు”గా అభివర్ణించారు.
Iran Counter | భారత్ స్పందన
ఈ వ్యాఖ్యలను అజ్ఞానపూరితమైనవి, అనుచితమైనవి, అసభ్యకరమైనవి అని భారత్ (India) ఖండించింది. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల వాస్తవికతను ఖచ్చితంగా ప్రతిబింబించవు అని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Iran Travel Advisory | ఇరాన్ వెళ్లొద్దు.. భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ

