Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్క్రైం

Mango Poisoning Deaths | ప్రాణాలు తీస్తున్న ‘కల్తీ’.. మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri
Last updated: June 11, 2026, 10:25 am 10:25 am
Srinivas Kolluri
Share
Mango Poisoning Deaths

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mango Poisoning Deaths | దేశంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతిదానిని కల్తీ చేస్తోంది. ఆహార పదార్థాల నుంచి మొదలు పెడితే పండ్లు, పాలు వేటిని వదలడం లేదు. వీటిని తింటున్న ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మామిడి పండ్లు (Mangoes) తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు.

హైదరాబాద్ (Hyderabad) నగరంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మామిడి పండ్లు తిన్న తర్వాత భువనేశ్వరి (17), సంధ్య (10) అనే అక్కాచెల్లెళ్లు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని బీదర్​కు చెందిన వైజినాథ్, ఇందుమతి కర్ణాటకలోని ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. వీరికి నలుగురు కూతుర్లు ఉన్నారు. వారు ఆదివారం నారాయణగూడలోని జలమండలి సమీపంలో మామిడి పండ్లను కొనుగోలు చేశారు. ఆ పండ్లను నలుగురు కుమార్తెలు, తల్లి ఇందుమతి తిన్నారు. అదే రోజు వారు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Mango Poisoning Deaths | చికిత్స పొందుతూ..

ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భువనేశ్వరి సోమవారం మృతి చెందింది. మంగళవారం సంధ్య చనిపోయింది. మిగిలిన వారు ఇంకా చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మామిడి పండ్లకు వాడిన రసాయనాల వల్ల వారు మరణించారా లేక మరేదైనా కారణం ఉందా అని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.

Mango Poisoning Deaths | రసాయనాలతో..

ప్రస్తుతం మార్కెట్ వివిధ రకాల మామిడి లభిస్తున్నాయి. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతుంది. ఆ పండ్లను రసాయనాలతో మగ్గిస్తున్నారు. అంతేగాకుండా పాడుకాకుండా పలు రకాల మందులు స్ప్రే చేస్తున్నారు. వాటిని తింటున్న ప్రజలు అనారోగ్యం బారీన పడుతున్నారు. కల్తీ మాఫియాతో ఆహారం అనుకుని మనం ఎక్కువగా విషాన్నే తింటున్నాం. ఇది స్లో పాయిజన్​లా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.

ఇది కూడా చదవండి..:  Hyderabad Rain Traffic | ఫ్యూచర్​ సిటీ వెంపర్లాట.. ఉన్న సిటీ ఊగిసలాట.. చిన్న వర్షానికే ట్రాఫిక్ నరకం!.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు దెబ్బతీస్తున్న మౌలిక వసతుల వైఫల్యాలు

TAGGED:Food Safety IndiaFruit AdulterationHealth Hazardshyderabad newsindia breaking newsMango Chemical RipeningMango Poisoning DeathsSister Death Case
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Xiaomi 17T Xiaomi 17T | షావోమీ నుంచి మిడ్‌రేంజ్ ఫోన్.. ఆ కార్డులపై 5 వేల డిస్కౌంట్!
Next Article Trump Warning Iran Trump Warning Iran | భారీ మూల్యం తప్పదు.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Hyderabad Passport Services
హైదరాబాద్

Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

By Shivam nagarani
Hyderabad LIG Housing
హైదరాబాద్

Hyderabad LIG Housing | హైదరాబాద్​లో పేదలకు గుడ్​న్యూస్​.. లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం

By Balla Sandeep Kumar
Navsari POCSO Case
జాతీయంక్రైం

Navsari POCSO Case | మృగం కంటే హీనం.. ఇద్దరు మైనర్​లపై సవతి తండ్రి కీచకపర్వం.. గర్భం దాల్చిన కూతుళ్లు.. మౌనం వహించిన తల్లి!

By Naresh Chandan
Armoor Lorry Accident |
క్రైంనిజామాబాద్

Armoor Lorry Accident | ఆర్మూర్​లో లారీ బీభత్సం.. కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు..

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.