అక్షరటుడే వెబ్డెస్క్: Mohali Office Murder | పంజాబ్లో ఒక భయంకరమైన ఉదంతం వెలుగుచూసింది. ఆఫీసులో తోటి ఉద్యోగులందరూ చూస్తుండగానే.. ఓ ప్రేమోన్మాది తన మాజీ ప్రియురాలిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.
Mohali Office Murder | పోలీసుల కథనం ప్రకారం..
పటియాలాకు చెందిన డింపుల్ (30) అనే మహిళ మోహాలీలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అదే ఆఫీస్లో పనిచేసే హర్జిందర్ సింగ్ (39) అనే వ్యక్తితో ఆమె గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల వీరిద్దరూ విడిపోయారు. బ్రేకప్ను తట్టుకోలేకపోయిన హర్జిందర్.. మళ్లీ తనతో కలవాలంటూ డింపుల్పై నిరంతరం ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

Mohali Office Murder | సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..
గురువారం సాయంత్రం తీవ్ర ఆవేశంతో ఆఫీసులోకి ప్రవేశించిన హర్జిందర్.. నేరుగా డింపుల్ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేసాడు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తినప్పటికీ, వదలకుండా వెంబడించి దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు. అక్కడున్న తోటి సిబ్బంది నిందితుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. డింపుల్ కుప్పకూలిపోయిన తర్వాత, నిందితుడు అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

Mohali Office Murder | నిందితుడి పరిస్థితి విషమం..
ఈ ఘాతుకంతో ఆఫీసులోని ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే డింపుల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన హర్జిందర్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సీసీటీవీ ఫుటేజ్..!
బ్రేకప్ చెప్పిందని ఆఫీసులోనే యువతిని దారుణంగా చంపిన ప్రియుడు
పంజాబ్ – మొహాలీలో ఒకే కంపెనీలో పనిచేస్తూ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న డింపుల్(30), హర్జిందర్ సింగ్(39)
అయితే ఇటీవల యువతి బ్రేకప్ చెప్పడంతో ఆఫీసులోనే వెంటపడి కత్తితో దాడి చేసి చంపేసిన ప్రియుడు… pic.twitter.com/4dX6QNubRo
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
ఇది కూడా చదవండి: Wipro Religious Harassment | మతమార్పిడి రగడ..‘వేధింపులు సహించం’ అంటూ విప్రో వార్నింగ్
