అక్షరటుడే, వెబ్డెస్క్: Pedigree India: శునకాల ఆహార రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘పెడిగ్రీ’ (PEDIGREE), భారత స్టార్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్తో కలిసి సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. పెంపుడు జంతువుల యజమానులకు తమ శునకాల పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని రూపొందించారు.
Pedigree India | ప్రచారంలోని అంశాలు..
సంపూర్ణ ఆహారం: పెడిగ్రీ గ్రేవీ అనేది కేవలం రుచికరమైనది మాత్రమే కాకుండా, ఇది 100 శాతం సంపూర్ణ , సమతుల ఆహారమని వాల్తామ్ పెట్కేర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ధృవీకరించింది. ఇందులో ఉండే ప్రొటీన్ ఎనిమిది కోడి కాలేయాలతో (Chicken Livers) సమానమైన శక్తిని శునకాలకు అందిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో జెమిమా , ఆమె పెంపుడు జంతువు ‘జేడ్’ మధ్య ఉండే అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ వీడియోలను చిత్రీకరించారు.
Pedigree India | యజమానిగా జెమిమా సందేశం..
ఒక బాధ్యతాయుతమైన పెట్ పేరెంట్గా జెమిమా మాట్లాడుతూ.. “క్రికెట్లో రాణించడానికి మనకు పోషకాహారం ఎంత ముఖ్యమో, మన పెంపుడు జంతువుల ఆరోగ్యానికి కూడా అంతే అవసరం. నా పెంపుడు జంతువు జేడ్ కు పెడిగ్రీ గ్రేవీ అంటే చాలా ఇష్టం. దీనివల్ల దానికి కావాల్సిన పూర్తి పోషకాలు అందుతున్నాయన్న నమ్మకం నాకు ఉంది” అని పేర్కొన్నారు.
మార్స్ పెట్ న్యూట్రిషన్ లక్ష్యం..
భారత్లో చాలా మంది యజమానులు కేవలం ఇంట్లో వండే ఆహారంపైనే ఆధారపడుతున్నారని, దీనివల్ల జంతువులకు అందాల్సిన పూర్తి పోషకాలు అందడం లేదని మార్స్ పెట్ న్యూట్రిషన్ ఇండియా సీఎంఓ అయేషా హుడా తెలిపారు. పెడిగ్రీ గ్రేవీని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శునకాలు మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటాయని సంస్థ వెల్లడించింది.
ఇది కూడా చదవండి..: Hyderabad Home Stays | హైదరాబాద్లో కపుల్స్కు స్పెషల్గా హోమ్ స్టేస్.. రోజు రోజుకి మారుతున్న ట్రెండ్

