అక్షరటుడే, న్యూఢిల్లీ: Kejriwal Tweet | ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంపై ఆప్ అధిష్టానం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన చేరిక కాదని, కేంద్రం తన ఆధీనంలోని దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చేసిన కుట్ర అని ఆరోపించింది.
Kejriwal Tweet | సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు..
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఈడీ (ED), సీబీఐ (CBI)లను ప్రయోగించి, ఎంపీలను భయపెట్టి బీజేపీ తమ వైపుకు లాక్కుందని ఆయన ఆరోపించారు. పార్టీ ఆ నేతల కోసం అన్నీ చేస్తే, ఇప్పుడు వారు స్వార్థం కోసం బీజేపీ ఒడిలో కూర్చున్నారని విమర్శించారు. ఎంపీలను లాక్కోవడమే కాకుండా, పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సంజయ్ సింగ్ మండిపడ్డారు.
Kejriwal Tweet | కేజ్రీవాల్ ట్వీట్ వార్
మరోవైపు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “బీజేపీ మరోసారి పంజాబీలను దెబ్బకొట్టింది” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ ఎంపీల వలస కేవలం పార్టీకి సంబంధించినది మాత్రమే కాదని, ఇది పంజాబీ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
बीजेपी ने फिर से पंजाबियों के साथ किया धक्का
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 24, 2026
ఇది కూడా చదవండి..: Kejriwal Shock | కేజ్రీవాల్కు భారీ షాక్.. ఒకేసారి ముగ్గురు ఎంపీలు బీజేపీ గూటికి!

