Power Substation | ఎత్తొండ క్యాంప్​లో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​: Power Substation | ఎత్తొండ క్యాంప్(Ethonda Camp) గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని (సబ్‌స్టేషన్) శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) ప్రారంభించారు. రూ. 3.354 కోట్ల వ్యయంతో, 5.0 ఎంవీఏ సామర్థ్యంతో ఈ ఉపకేంద్రాన్ని నిర్మించారు.

Power Substation | అవరోధాల్లేని విద్యుత్​ సరఫరా కోసం..

2

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్​ సరఫరాలో ఎలాంటి అవరోధాల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం (Telangana Power Department) ఆయా ప్రాంతాల్లో కొత్త సబ్​స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని పోచారం అన్నారు. ఈ ఫీడర్​ కింద 132/33 కేవీ కోటగిరి సబ్‌స్టేషన్ నుండి 3కి.మీ. మేర ప్రధాన సరఫరా ఉంటుందని.. అత్యవసర సమయాల కోసం 132కేవీ బెల్లాల్ సబ్‌స్టేషన్ నుండి ప్రత్యామ్నాయ సరఫరా లైన్ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ​ఈ కేంద్రం ద్వారా 4 నూతన 11 కేవీ ఫీడర్లను (ఎత్తొండ టౌన్, ఎత్తొండ అగ్రికల్చర్, మీర్జాపూర్, సిద్ధాపూర్) అనుసంధానించారని వివరించారు.

Power Substation | నిరంతర విద్యుత్ కోసం..

అనంతరం విద్యుత్​ శాఖ ఎస్​ఈ రాజేశ్వర్​ రావు మాట్లాడుతూ..ఎత్తొండ క్యాంప్, సిద్ధాపూర్, సిద్ధాపూర్ క్యాంప్, యాద్‌గర్‌పూర్, మీర్జాపూర్ గ్రామాల్లోని వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. ​లో-వోల్టేజీ సమస్యలు తొలగిపోతాయి. ​ఈ నూతన సబ్‌స్టేషన్ వల్ల కోటగిరి, రాయికూర్, తక్లీ, చిన్నపెంట ఉపకేంద్రాలపై అదనపు లోడ్ తగ్గి, బోధన్ డివిజన్ విద్యుత్ నెట్‌వర్క్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ​ఈ కార్యక్రమంలో అగ్రోస్ రాష్ట్ర ఛైర్మన్ కాసుల బాల్‌రాజ్, స్థానిక సర్పంచులు జి. వీరమణి, ఎం. శ్వేత, బోధన్ ఆర్డీవో శ్రీమతి విజయకుమారి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ పి.వి. రాజేశ్వర్ రావు, డీఈలు ముక్తార్, వెంకటరమణ, ఈఈ స్వామి, ఏడీఈ కన్​స్ట్రక్షన్​ తోట రాజశేఖర్​, ఏడీఈ ఆపరేషన్స్/రుద్రూర్ నవీన్ రెడ్డి, ఏడీఈ టీఆర్​ఈ నటరాజ్, ఏఈ కన్​స్ట్రక్షన్​ బోధన్ సుమిత, ఏఈ ఆపరేషన్స్ కోటగిరి బుజ్జిబాబు, ఏఈ సివిల్ నిజామాబాద్​ కార్తీక్, ఏఈ ఆపరేషన్స్ మనీషా, ఏఈ ప్రొటెక్షన్ భావిత, భాస్కర్ ప్రసాద్, ఎస్​ఎల్​ఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

44

ఇది కూడా చదవండి: Raja Singh Comments | నాకు జరిగిందే అన్నామలై విషయంలో రిపీట్​ : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన మాటలు దేనికి సంకేతం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *