అక్షరటుడే, బోధన్: Power Substation | ఎత్తొండ క్యాంప్(Ethonda Camp) గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని (సబ్స్టేషన్) శుక్రవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) ప్రారంభించారు. రూ. 3.354 కోట్ల వ్యయంతో, 5.0 ఎంవీఏ సామర్థ్యంతో ఈ ఉపకేంద్రాన్ని నిర్మించారు.
Power Substation | అవరోధాల్లేని విద్యుత్ సరఫరా కోసం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవరోధాల్లేకుండా ఉండేందుకు ప్రభుత్వం (Telangana Power Department) ఆయా ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని పోచారం అన్నారు. ఈ ఫీడర్ కింద 132/33 కేవీ కోటగిరి సబ్స్టేషన్ నుండి 3కి.మీ. మేర ప్రధాన సరఫరా ఉంటుందని.. అత్యవసర సమయాల కోసం 132కేవీ బెల్లాల్ సబ్స్టేషన్ నుండి ప్రత్యామ్నాయ సరఫరా లైన్ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా 4 నూతన 11 కేవీ ఫీడర్లను (ఎత్తొండ టౌన్, ఎత్తొండ అగ్రికల్చర్, మీర్జాపూర్, సిద్ధాపూర్) అనుసంధానించారని వివరించారు.
Power Substation | నిరంతర విద్యుత్ కోసం..
అనంతరం విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ..ఎత్తొండ క్యాంప్, సిద్ధాపూర్, సిద్ధాపూర్ క్యాంప్, యాద్గర్పూర్, మీర్జాపూర్ గ్రామాల్లోని వ్యవసాయ, గృహ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. లో-వోల్టేజీ సమస్యలు తొలగిపోతాయి. ఈ నూతన సబ్స్టేషన్ వల్ల కోటగిరి, రాయికూర్, తక్లీ, చిన్నపెంట ఉపకేంద్రాలపై అదనపు లోడ్ తగ్గి, బోధన్ డివిజన్ విద్యుత్ నెట్వర్క్ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రోస్ రాష్ట్ర ఛైర్మన్ కాసుల బాల్రాజ్, స్థానిక సర్పంచులు జి. వీరమణి, ఎం. శ్వేత, బోధన్ ఆర్డీవో శ్రీమతి విజయకుమారి, విద్యుత్ శాఖ ఎస్ఈ పి.వి. రాజేశ్వర్ రావు, డీఈలు ముక్తార్, వెంకటరమణ, ఈఈ స్వామి, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడీఈ ఆపరేషన్స్/రుద్రూర్ నవీన్ రెడ్డి, ఏడీఈ టీఆర్ఈ నటరాజ్, ఏఈ కన్స్ట్రక్షన్ బోధన్ సుమిత, ఏఈ ఆపరేషన్స్ కోటగిరి బుజ్జిబాబు, ఏఈ సివిల్ నిజామాబాద్ కార్తీక్, ఏఈ ఆపరేషన్స్ మనీషా, ఏఈ ప్రొటెక్షన్ భావిత, భాస్కర్ ప్రసాద్, ఎస్ఎల్ఐ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Raja Singh Comments | నాకు జరిగిందే అన్నామలై విషయంలో రిపీట్ : రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన మాటలు దేనికి సంకేతం!
