Punjab Gangsters Encounter | పంజాబ్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు గ్యాంగ్​స్టర్లకు గాయాలు

పంజాబ్​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గ్యాంగ్​స్టర్లు గాయపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Punjab Gangsters Encounter | పంజాబ్​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు గ్యాంగ్​స్టర్లు గాయపడ్డారు.

ఫిరోజ్‌పూర్ జిల్లా మల్లన్‌వాలా ప్రాంతంలో పోలీసులతో జరిగిన కాల్పుల ఘటనలో వసూళ్ల కేసులకు సంబంధం ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు గాయపడి అరెస్టు అయ్యారని అధికారులు తెలిపారు. పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బైక్​పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపడానికి ప్రయత్నించారు. అయితే నిందితులు ఆగకుండా పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోగా కాల్పులు జరిపారు.

Punjab Gangsters Encounter | ఎదురు కాల్పులు

నిందితులు పోలీసు వాహనంపై మూడు రౌండ్లు కాల్పులు జరపగా, పోలీసులు తమ వాహనం వెనుక రక్షణ తీసుకుంటూ ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారని, ఆ తర్వాత వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితులను సదర్ పట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్వాండీ సోభా నివాసి జితేందర్ సింగ్ కుమారుడు హర్‌ప్రీత్ సింగ్, రాజ్‌పాల్ సింగ్ కుమారుడు దిల్బాగ్ సింగ్‌గా గుర్తించారు. వారి నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవస్థీకృత నేరాలు, గ్యాంగ్ కార్యకలాపాలు, వసూళ్ల ముఠాలపై పంజాబ్ పోలీసులు చేపట్టిన చర్యల నేపథ్యంలో ఈ తాజా ఎన్‌కౌంటర్ జరిగింది.

దీనిని కూడా చదవండి : JPSC Exam Scam | జార్ఖండ్​ పరీక్షల్లో అక్రమాలపై ఈడీ కేసు నమోదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.