అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Rice Mill Action | జిల్లాలో(Nizamabad) నిబంధనలు ఉల్లంఘించిన రైస్మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఆర్ రైస్మిల్లులలో చోటు చేసుకున్న అవకతవకలపై సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్షించారు.
Rice Mill Action | సీఎంఆర్ అవకతవకలపై..
జిల్లాలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, స్వాధీనం చేసుకున్న ధాన్యం, బియ్యం, సంబంధిత రికార్డులను సీపీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితులపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు, మిగిలిన కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ విచారణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎంఆర్ ధాన్యంలో పారదర్శకతను పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ సప్లై శాఖ, పోలీసు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
Rice Mill Action | పునరావృతం కాకుండా..
భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు పునరావృతం కాకుండా నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మేనేజర్ ప్రవీణ్, జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మేనేజర్ అరవింద్ రెడ్డి, రైస్మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయానంద్ గుప్తా, రాష్ట్ర రైస్మిల్ అసోసియేషన్ సెక్రెటరీ వడ్డీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.